ఉచిత కంటి వైద్య శిబిరం సక్సెస్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/రామారెడ్డి ప్రతినిది:  కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఐటీ సెల్ చైర్మన్ మదన్మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం సక్సెస్ అయ్యింది ఈ సందర్భంగా మదన్మోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో గెలుపొందిన ఎమ్మెల్యే ఇప్పటివరకు ప్రజలను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు ప్రజల కోసం సేవ చేస్తానని మాట ఇచ్చి పార్టీ మారి ప్రజలను మర్చిపోయారని గుర్తు చేశారు ఎల్లవేళల ప్రజలకు అందుబాటులో ఉండి ఉచిత వైద్యం విద్య ప్రజలకు సౌకర్యవంతమైన పాలన అందించేందుకు రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు కాంగ్రెస్ పార్టీలో తనను ఆశీర్వదించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లింగంపేట్ మండల అధ్యక్షులు షరీఫ్, గాంధారి మండల అధ్యక్షులు తూర్పు రాజన్న, సదాశివ నగర్ మండలం అధ్యక్షుడు లింగా గౌడ్, కామారెడ్డి యూత్ అధ్యక్షుడు భరత్ రెడ్డి , గాంధారి ఉపాధ్యక్షుడు జయరాజ్, భూ పోరాట సమితి నాయకులు చిట్యాల సాయన్న , కామారెడ్డి సోషల్ మీడియా కన్వీనర్ సాజిత్,మహ్మద్ హనీఫ్, సంగని బాబా, లక్ష్మణ్, తాడ్వాయి మండల మైనార్టీ నాయకులు షౌకత్ , సీనియర్ నాయకులు శ్రీకాంత్ , తాడ్వాయి మండల అధ్యక్షులు రాజు, తాడ్వాయి మండల సీనియర్ కార్యకర్తలు తదితరులు గ్రామస్తులు వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.