1న చార్మినార్ కు చేరుకోనున్న జోడో యాత్ర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రా ఈ నెల 1 వ తేదీన శంషాబాద్ మీదుగా ఉదయము 9 గంటలకు నగరములోని ఆరాంఘర్ కు చేరుకుని అక్కడ నుండి . 10.30 గంటలకు తాడ్ బంద్ వద్ద గల లెజెండ్ ప్యాలెస్ చేరుకుని విరామము.

సాయాంత్రము 4 గంటలకు పురానాపూల్ వద్ద ప్రారంభమై హుస్సేనిఆలం, లాడ్ బజార్ మీదుగా 4.30 గంటలకు చార్మినార్ కు చేరుకుంటుంది.

19 అక్టోబర్, 1990 న రాజీవ్ గాంధీ గారు పార్టీ పతాకాన్ని ఎగుర వేసి జంట నగరాలలో సద్భావనా యాత్రా ప్రారంభించిన రాజీవ్ గాంధీ సద్భావనా యాత్రా స్మారక స్తంభంపై శ్రీ రాహుల్ గాంధీ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

ఆ తరువాత గుల్జార్ హౌజ్, మదీనా, నయాపూల్, ఉస్మాన్ గంజ్, మొజాంజాహి మార్కెట్, గాంధీభవన్, నాంపల్లి, పబ్లిక్ గార్డెన్, అసెంబ్లీ, ఎ.జి ఆఫీస్, ఎన్ టి ఆర్ గార్డెన్ మీదుగా నెక్లెస్ రోడ్ చేరుకుని కార్నర్ మీటింగ్ జరుగుతుంది.

Leave A Reply

Your email address will not be published.