తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భాగ్యనగరంలో మెట్రో రైలు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ అభ్యర్థన మేరకు ప్రస్తుతమున్న ఛార్జీల సవరణకు కేంద్ర ప్రభుత్వం ఫేర్ ఫిక్సేషన్ కమిటీ(ఎఫ్ఎఫ్సీ)ని ఏర్పాటు చేసింది. ప్రస్తుత ఛార్జీల సవరణకు సంబంధించి తమ అభిప్రాయాలు, సలహాలను నవంబరు 15లోగా తెలపాలని కమిటీ ఛైర్మన్ ప్రయాణికులను కోరారు. మెయిల్ ద్వారా గానీ, తపాలా ద్వారా అయితే ఛైర్మన్, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ, మెట్రో రైలు భవన్, బేగంపేట, 500003 చిరునామాకు పంపాల్సిందిగా కోరారు.