ఘనంగా సర్దార్ ఫల్లాభాయ్ పటేల్ జయంతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్‌ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడంలో ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ పటేల్‌ కీలక పాత్ర పోషించారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. పటేల్‌ జయంతిని పురస్కరించుకుని సీఆర్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో 5కె రన్‌ను ఏర్పాటు చేశారు. ఈ రన్‌ను నెక్లెస్‌ రోడ్డులోని పీపుల్స్‌ ప్లాజాలో కిషన్‌రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వల్లభ్‌భాయ్‌ నిర్వహించిన పోలీసు యాక్షన్‌ కారణంగానే హైదరాబాద్‌లో భారత్‌ విలీనమైందన్నారు. ఆయన జయంతిని కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా సమైక్యతా దినోత్సవంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. 5కె పరుగులో సీఆర్‌పీఎఫ్‌ అధికారుల, సిబ్బందితో పాటు వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.