తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన ఘటన సీఎం కేసీఆర్దేనని మంత్రి హరీశ్రావు అన్నారు. మునుగోడు నియోజకవర్గంలో ఆదివారం నిర్వహించిన కేసీఆర్ సభతో భాజపా నాయకులకు కంటిమీద కునుకులేకుండా పోయిందన్నారు. కేంద్రమంత్రి కిషన్రెడ్డి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్వి నకిలీ మాటలు, వెకిలి చేష్టలని ఆయన విమర్శించారు. నోటికొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడుతున్నారని.. వాళ్లు మాట్లాడే మాటలు గల్లీ నేతలు కూడా మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు.