మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల వినతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఏజెన్సీ కార్మిక సంగం నాయకులూ సోమవారం బాన్సువాడ ఆర్డీఓ కార్యాలను సిబ్బందికి వినతిపత్రం సమర్పించారు. ఈసందర్బంగా మధ్యాహ్న భోజన ఏజెన్సీ కార్మిక సంఘం కామారెడ్డి జిల్లా గౌరవ అధ్యక్షులు జే రవీందర్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు సురేష్ గొండమాట్లాడుతూ జుక్కల్ హైస్కూల్లో పనిచేస్తున్న ఏజెన్సీ కార్మికురాలు నాగంపల్లి వెంకమని ఐదు రోజుల క్రితం కుక్కర్ పేలి రెండు చేతులు కాలిపోవడం జరిగింది వారి కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని ఆర్డీవో సూపర్ డెంట్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ప్రభుత్వానికి చాలాసార్లు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది ఉద్యోగ భద్రత కల్పించాలి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇచ్చిన ఉపయోగంలో లేదు దయచేసి ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే మధ్యాహ్న భోజన కార్మికులందరికీ పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి, కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈఎస్ఐ హాస్పిటల్ నిర్మించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో జుక్కల్ మండల అధ్యక్షులు నర్సింలు ఉపాధ్యక్షులు హనుమంతు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.