ఎస్సీ ఎస్టీ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో సీఎం, స్పీకర్ చిత్రపఠాలకు పాలబిషేకం

గిరిజనులకు 10 శాతంకు రిజర్వేషన్లు పెంచినందుకు గాను ఎస్సీ, ఎస్టీ ఉపాద్యాయ సంఘం ఆధ్వర్యంలో బాన్సువాడ పట్టణ కేంద్రంలో ఆదివారం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ల చిత్రపటాలకు పాలాభిషేకం చేసారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొనగా
ఉపాధ్యాయ సంఘ సభ్యులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఇచ్చిన మాట ప్రకారం ST లకు 10 శాతం రిజర్వేషన్లు పెంచడం వల్ల గిరిజనులు ఆయనకు రుణపడి ఉంటారని, భావితరాలు గుర్తుంచుకుంటారని, అదేవిధంగా తామందరం పోచారం శ్రీనివాస్ రెడ్డికి రుణపడి ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ ఉపాద్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ అయ్యల సంతోష్, బాన్సువాడ మండల అధ్యక్షులు లఖ్య, మండల ప్రధాన కార్యదర్శి గోపి, మహిళ కార్యదర్శి మయూరి, వసంత్, గణపతి,
తారచంద్, దేవీసింగ్, బాల్ సింగ్, దశరథ్, శంకర్, రమేష్, నాయకులు మోహన్ నాయక్, పిట్ల శ్రీధర్, పాత బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.