సామ్‌ అనారోగ్యం.. అప్పుడు మాకు తెలియదు

.. వరలక్ష్మి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్‌: సమంత అనారోగ్యంపై స్పందించారు నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ సామ్‌ త్వరలోనే కోలుకుని మరింత బలంగా తిరిగి వస్తారని ఆమె ఆకాంక్షించారు. ‘‘సామ్‌ నాకు 12 ఏళ్ల ముందు నుంచే తెలుసు. మా స్నేహం చెన్నై నుంచి మొదలైంది. ‘యశోద’ కోసం తనతో కలిసి నటించడం ఆనందంగా ఉంది. సెట్‌లో మేమిద్దరం ఎంతో సరదాగా ఉండేవాళ్లం. చెన్నై రోజుల్ని గుర్తు చేసుకుని నవ్వుకునేవాళ్లం. అయితే, షూటింగ్‌ సమయంలో ఆమె అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని మాకు తెలియదు. ఎందుకంటే తను ఎప్పుడూ యాక్టివ్‌గానే ఉండేది. షూట్‌ తర్వాతే ఆమె ఆరోగ్యం క్షీణించిందని నేను అనుకుంటున్నా. ఆమె ఒక ఫైటర్‌. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో తిరిగి వస్తుంది ’’ అని అన్నారు. అనంతరం తన తదుపరి ప్రాజెక్టుల గురించి మాట్లాడుతూ.. ‘‘బాలకృష్ణ నటిస్తోన్న ‘వీర సింహారెడ్డి’లో ఓ కీలకపాత్ర పోషిస్తున్నా. ఇందులో పాత్ర కోసం సుమారు 15 కిలోల బరువు తగ్గాను. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది. దీనితోపాటు తెలుగు, తమిళంలో వరుస ప్రాజెక్ట్స్‌ చేస్తున్నాను’’ అని ఆమె అన్నారు. సరోగసి కథాంశంతో తెరకెక్కిన సస్పెన్స్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘యశోద’. హరి-హరీశ్‌ దీన్ని తెరకెక్కించారు. సమంత ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌కుమార్‌ కీలకపాత్ర పోషించారు. నవంబర్‌ 11న ఈ సినిమా ప్రేక్షకుల ప్రేక్షకుల ముందుకు రానుంది.

Leave A Reply

Your email address will not be published.