సీతమ్మకు బంగారు నెక్లెస్ అలంకరణ.
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్: మండల కేంద్రం బీర్కూర్ మండల కేంద్రం లోని శ్రీ కోదండ రామాలయం సీతమ్మ తల్లికి సోమవారం రోజు బంగారు నెక్లెస్ అలంకరించారు. బీర్కూర్కు చెందిన నార్ల ఉమారాణి, భరత్ రాజ్ గుప్తా దంపతులు 75వేల రూపాయల విలువ గల నెక్లెస్ తయారు చేయించగా ఆలయ ప్రధాన పూజారి శేషు పంతులు పూజలు చేసి సీతమ్మ తల్లికి అలంకరించారు. ఈ సందర్బంగా దంపతులకు ఆలయ కమిటీ తరపున శాలువా కప్పి సన్మానం చేసారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఎంపీపీ రఘు, మాజి జడ్పీటీసీ ద్రోణవల్లి సతీష్, రైతు సమన్వయ అధ్యక్షుడు అవారి గంగారాం, లాడేగాం వీరేశం, దుంపల రాజు, కొట్టూరి హన్మాండ్లు గుప్త, లాడేగాం గంగాధర్, నాందేవ్, కుటుంబరావు భక్తులు పాల్గొన్నారు.