మునుగోడులో జోరుగా బీర్కూర్ నాయకుల ప్రచారం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/బీర్కూర్: మునుగోడు ఉప ఎన్నికల్లో బీర్కూర్ తెరాస నాయకులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. బీర్కూర్ ఎంపీటీసీ సందీప్, బీర్కూర్ మండల ఎస్టి సెల్ అధ్యక్షుడు సాయికుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తలు ఇంటింటికి తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ని గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్ చేసిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ పథకాలు ఓటర్లకు వివరిస్తూ ప్రచారం సాగిస్తున్నారు.