రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌ను అనుమతించవద్దు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జూబ్లీహిల్స్‌లోని పబ్‌ల వ్యవహారంలో మరోసారి విచారణ చేపట్టింది హైకోర్టు. 10 పబ్‌లలో రాత్రి పది గంటల తర్వాత మ్యూజిక్‌ వినిపించకూడదని గతంలో సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని అప్పీలు చేసింది రెస్టారెంట్‌ అసోసియేషన్‌.

ఈ అప్పీలుపై విచారణ సందర్భంగా డివిజనల్‌ బెంచ్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. సింగిల్‌ బెంచ్‌ తీర్పు జూబ్లీహిల్స్‌లోని 10 పబ్‌లకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

ఈ ఏడాది సెప్టెంబర్‌ 26న పబ్‌లపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సింగిల్‌ జడ్జి కీలక ఆదేశాలు జారీ చేశారు. రాత్రి 10 గంటల తర్వాత మ్యూజిక్‌ను అనుమతించవద్దని ఆదేశాలు జారీ చేశారు. అలాగే మైనర్లను కూడా పబ్‌లలోకి అనుమతివ్వొద్దని ఆదేశించారు.

Leave A Reply

Your email address will not be published.