ఫామ్ హౌస్‌కే పరిమితం అయిన టీఆర్ఎస్ పాలన: రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:

తెలంగాణ సమాజానికి రాష్ట్ర పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ పాలన ఫామ్ హౌస్‌కే పరిమితం అయిందని, 8 ఏళ్లుగా టీఆర్ఎస్ అరాచకాలకు బీజేపీ వంతపాడిందని విమర్శించారు. దేశం కోసం ఒక్కడు ముందడుగు వేశారని.. నవంబర్ 1న హైదరాబాద్‌కు అందరూ తరలిరావాలని పిలుపిచ్చారు. రేపటి భవిష్యత్ కోసం రాహుల్ గాంధీ కి మద్దతుగా నిలుద్దామన్నారు. ప్రతి ఒక్కరు కనీసం ఒక కిలోమీటర్ అయిన నడుద్దామని సూచించారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు వస్తారని ఆశిస్తున్నానని.. నవంబర్ 1వ తేదీ సాయంత్రం 3 గంటలకు చార్మినార్ వద్ద అందరం కలుద్దామని రేవంత్ రెడ్డి లేఖ రాశారు.

Leave A Reply

Your email address will not be published.