గోషామహల్ ఎంఎల్ఏ రాజా సింగ్ ను వెంటనే విడుదల చేయాలి

తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: ఫీడి యాక్ట్  క్రింద అరెస్ట్ చేయబడిన గోషామహల్  శాసన సబ్యులు రాజా సింగ్ ను వెంటనే విడుదల చేయాలని బీ పీ యల్ పార్టీ లోని సామాజిక విభాగమైన సుప్రీం సేవ సోసైటి ప్రధాన కార్యదర్శి గాడిపల్లి హరి నేతృత్వంలోనేడు సికింద్రాబాద్ లోని వారాసి గూడా చౌరస్తా లో ప్లకార్ద్ లతో రస్తా రోఖో నిర్వహించారు. ఈ సందర్బంగా సుప్రీం సేవ సోసైటి ఫౌండర్ బొమ్మ నరేంద్ర పద్మశాలి మాట్లాడుతూ గోరక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్న రాజా సింగ్, ఫారూఖ్ మునావర్ షోలో హిందువుల మనోభావాలను తీవ్రంగా ఖండిస్తూ హేళనగా మాట్లాడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో రానివ్వడం లేదు,భగవత్ గీత, ఖురాన్, బైబిల్ లోని సారాంశం శాంతియుతంగా అన్నదమ్ముల్లా కలిసి ఉండాలని బోధిస్తాయీ,గోరక్షణ వల్ల ప్రకృతిలో ఆక్సిజన్ పెరుగుతుంది, కృత్రిమ పాల కన్న గోపాలు శ్రేయస్కరం, గోమయంతో సకల సౌకర్యాలు , గోమూత్రం కూడా శుభప్రదం అని అన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం త్వరగా విడుదల చేయాలి లేదా హిందూ సంస్థలు ఒక్కటై రానున్న ఎన్నికల్లో దెబ్బ తీస్తాయి, మూకుమ్మడిగా జైల్ భరో కార్యక్రమం చేపడుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పెండం సంతోష్,దూస లక్ష్మి, కడియాల బల్రామ్, నాగసాయి, బొమ్మ గిరిజ, బోగ వజ్రేశ్వర్, ఎల్లమ్మ, కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.