సృజనాత్మకతను వెలికితీసేలా సాంకేతిక ఆవిష్కరణలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: విద్యార్థులలో అంతర్లీనంగా ఉన్న సృజనాత్మకతను వెలికితీసి, వినూత్నఆలోచనలకు ఒక రూపును అందించే క్రమంలో పాలీ టెక్ ఫెస్ట్ 2022ను నిర్వహిస్తున్నామని రాష్ట్ర ఆర్ధిక, వాణిజ్య పన్నులు, నైపుణ్యాభివృద్ది, శిక్షణ శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి అన్నారు. మంగళవారం సచివాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో పాలీ టెక్ ఫెస్ట్ 2022 పోస్టర్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రాజేంద్రనాధ్ రెడ్డి మాట్లాడుతూ విజయవాడలో నవంబర్ 24 నుండి 26 వరకు మూడు రోజుల పాటు ఈ రాష్ట్ర స్ధాయి కార్యక్రమం జరగనుందని, అన్ని జిల్లాలలోని పాలిటెక్నిక్ విద్యార్ధులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారని వివరించారు. ప్రతి రెండేళ్లకోసారి టెక్ ఫెస్ట్ నిర్వహించడం ఆనవాయితీగా ఉండగా, కరోనా కారణంగా 2020లో నిర్వహించబడలేదన్నారు. సాంకేతి