రౌండప్ ప్రయోగం .. మేకల మంద మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/కామారెడ్డి ప్రతినిధి: కామారెడ్డి జిల్లా, మండలంలోని టేక్రియాల్ గ్రామంలో ఓ రైతుకు చెందిన మొక్కజొన్న చేనులో రౌండప్ అనే రసాయన మందును ప్రయోగం చేశారు. ఓ కురుమ సోదరుడు మేకల మందను అటువైపుగా తీసుకువెళ్లగా రౌండ్ ఆఫ్ ప్రయోగించిన పోతనగారీ శంకర్ అనే వ్యక్తి మక్కా చేనులో గొర్రెలు కాపారుడు గొర్రెలను మేతకు తీసుకువెళ్లగా దాదాపు 9 గొర్రెలు మృతి చెందాయని కురుమ సోదరులు కన్నీరు మునీరు అయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ , రౌండఫ్  ప్రయోగించిన వారిని మేకలు చనిపోయాయని అడగగా మా చేనులోకి ఎందుకు తీసుకువచ్చావ్ అని బెదిరించారని అన్నారు. గొర్రెలు మృతి చెంందాయని గ్రామ పెద్దమనుషులకు చెప్పుకోగా ఫలితం శూన్యమని చెప్పారు. గొర్రెలపై ఆధారపపడి జీవిస్తున్న మాకు కన్నీళ్లు మిగిలాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వ అధికారులు తమకు న్యాయం చేసి ఆర్థికంగ ఆదుకోవాలని వారు వేడుకుంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.