కుప్పంలో నవ వధువు ఆత్మహత్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకుంది. వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతోంది. ఇంతలో యువతి అనుమానాస్పద మరణం సంచలనంగా మారింది. కుప్పం పాతపేటకు చెందిన రోహిత్‌, భువనేశ్వరిలు రెండు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గురువారం మధ్యాహ్నం వరకు ఆనందంగా ఉన్న భువనేశ్వరి ఇంటిపై గదిలో దూలానికి వేలాడుతూ కనిపించింది. అప్పటికే ప్రాణాలు కోల్పోయింది. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతురాలిని కుప్పం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు . భర్త ఇంటివారే తమ బిడ్డను హతమార్చారని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలి తండ్రి శరవణ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భువనేశ్వరి మరణానికి కారణాలు తెలియాల్సి ఉంది. ఎంతో అన్యోన్యంగా వైవాహిక జీవితం ప్రారంభించారు.. కానీ ఇంతలో భువనేశ్వరి మరణం తీవ్ర విషాదాన్ని నింపింది. అలాగే ఈ కేసులో రోహిత్ కుటుంబ సభ్యుల్ని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.