అమ్మవారి ఆశీర్వాదం తీసుకున్న డీసీసీబీ చైర్మన్
బాన్సువాడ పట్టణంలో పలు దుర్గా మాత మండపాలను ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి దర్శించుకుని అమ్మ వారి ఆశీర్వాదం తీసుకున్నరు. సరస్వతి మాత ఆలయం లో నిర్వహించిన పల్లకి సేవ లో సతీమణి శ్రీమతి సోనీ రెడ్డి గారితో కలిసి పాల్గొన్నరు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియం లో విజయదశమి రోజున నిర్వహించే రావణ దహనం కార్యక్రమం ఏర్పాట్లను స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమాలలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.