ట్విట్టర్ సేవల్లో అంతరాయం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:   మొన్న వాట్సాప్‌ సేవలు గంటన్నరపాటు నిలిచిపోవడం ఎంత పెద్ద చర్చకు దారి తీసిందో చెప్పాల్సిన పనిలేదు. అయితే తాజాగా ట్విట్టర్‌ వంతు వచ్చింది. శుక్రవారం ట్విట్టర్‌ సేవల్లో అంతరారయం ఏర్పడింది. కొంత మంది యూజర్లు ట్విట్టర్‌ సేవలు నిలిచిపోయాయి. యూజర్లు లాగిన్‌ అవుతోన్న సందర్భంలో ఎర్రర్‌ మెసేజ్‌ చూపిస్తుంది. ‘సమ్‌థింగ్‌ వెంట్ రాంగ్‌’ అనే ఎర్రర్‌ మెసేజ్‌ చూపిస్తోంది. అయితే దీనిపై ట్విట్టర్‌ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన మాత్రం రాలేదు. అయితే ఈ అసౌకర్యం కేవలం వెబ్‌ యూజర్లకు మాత్రమే కలిగినట్లు తెలుస్తోంది. మొబైల్‌ ఫోన్స్‌లో ట్విట్టర్‌ యాప్‌ను ఉపయోగిస్తున్న వారికి సేవలు యధావిధిగా కొనసాగుతున్నాయని సమాచారం. కేవలం కంప్యూటర్స్‌లో ఆపరేట్‌ చేసే వారికే ఈ సమస్య తలెత్తినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే గత కొన్ని రోజుల క్రితం ఇన్‌స్టాగ్రామ్‌లోనూ ఇలాంటి సమస్య ఎదురైన విషయం తెలిసిందే. టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ట్విట్టర్‌ను కొనుగోలు చేసిన తర్వాత కీలక మార్పులు జరుగుతున్న విషయం తెలిసిదే. ఈ క్రమంలోనే తాజాగా ట్విట్టర్‌ సేవల్లో అంతరాయం ఏర్పడడం గమనార్హం. ఇదిలా ఉంటే ఏమంటూ ఎలాన్ మస్క్ వాట్సాప్ ను హస్తగతం చేసుకున్నాడో అనేక మార్పులకు శ్రీకారం నంది పలికారు. ఇప్పటి వరకు ఉచితంగా ఉన్న బ్లూ టిక్ ఆప్షన్ ను పెయిడ్ గా మార్చారు. ఇకపై బ్లూ టిక్ పొందాలనుకునే వారు నెలకు 8 డాలర్లు చెల్లించాలని తెలిపారు. ఆదాయ మార్గాల అన్వేషణలో భాగంగా ట్విట్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక ట్విట్టర్ లో ప్రక్షాళన మొదలు పెట్టిన మస్క్ భారీగా ఉద్యోగులను కూడా తొలగించనున్నట్లు వచ్చిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.