మెదక్ ఎమ్మెల్యేపై షర్మిల తీవ్ర ఆరోపణలు
మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డిపై వైయస్సార్ టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల తీవ్ర ఆరోపణలు చేశారు. నియోజకవర్గంలో భార్యాభర్తలు దోపిడీ చేస్తున్నారని, కమిషన్లు కక్కుర్తి పడడంతో కలెక్టర్ భవనం నిర్మాణం జరగడంలేదని షర్మిల ఆరోపించారు. సొసైటీలో అక్రమాలకు పాల్పడ్డ దేవేందర్ రెడ్డి పై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ప్రజలకు ఒక న్యాయం.. ఎమ్మెల్యే భర్తకు మరో న్యాయమా అని ప్రశ్నించారు