రామన్ గౌడ్ ను పరామర్శించిన బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న హిమాయత్ నగర్ కార్పొరేటర్ గడ్డం మహాలక్ష్మి భర్త రామన్ గౌడ్ ను  బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ శనివారం పరామర్శించారు. ఈ సందర్బంగా రామన్ గౌడ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తొందరగా కోలుకుని ప్రజాసేవలో నిమగ్నం కావాలని ఆకాంక్షించారు. రామన్ గౌడ్ ను పరామర్శించిన వారిలో పార్టీ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు గౌతమ్ రావు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్. కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి, లంకల దీపక్ రెడ్డి తదితరులు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.