బసవేశ్వర ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆర్థిక శాఖ మంత్రి
కొకాపెట్ లో బసవేశ్వర ఆత్మగౌరవ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు. ముఖ్య అతిథులుగా హాజరైన శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు. పాల్గొన్న రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ, ఎంపీలు, ఎమ్మెల్యేలు, బసవ సమన్వయ కమిటీ ప్రతినిధులు, లింగాయత్ సమాజం ప్రతినిధులు తదితరులు. ఈసందర్భంగా స్పీకర్ పోచారం గారు మాట్లాడుతూ. కులం లేదు, మతం లేదు, అందరం సమానమే అని నినదించిన వ్యక్తి బసవేశ్వరుడు. బసవేశ్వరుడిని ఆదర్శంగా తీసుకొని కుల మతాలకు అతీతంగా ఉండాలి. బసవేశ్వరుడి ఆధ్వర్యంలో ఆనాడే కులాంతర వివాహాలు జరిగాయి. మనుషులందరూ ఒక్కటే, కులాలు లేవు, ఉప కులాలు లేవు అన్నారు.
పేదల క్షేమం కోసం సీఎం కేసీఆర్ గారు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందరికీ చేరాలి.