మునుగోడు ఫలితాల్లో మెజారిటీ మీరిచ్చినవే
... ప్రజా ప్రతినిధులు తెరాస నాయకులకు పోచారం భాస్కర్ రెడ్డి కృతజ్ఞతలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు నియోజకవర్గం పరిధిలోని చౌటుప్పల్ మండలం లోని చిన్న కొండూరు, మందల గూడెం గ్రామాల పరిధిలో TRS పార్టీ అభ్యర్థికి 642 ఓట్ల మెజారిటీ మన బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, నాయకుల నెల రోజులు కుటుంబాలకు దూరమై మీరు చేసిన కటోర శ్రమకు ప్రతిఫలంగా మనం ప్రచారం నిర్వహించిన చిన్న కొండూరు MPTC పరిధిలో TRS పార్టీకి 642 ఓట్ల మెజారిటీ వచ్చింది.
బాన్సువాడ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు ప్రతి రోజు ఇంటింటికి తిరుగుతూ, ప్రజలను వ్యక్తిగతంగా కలుసుకుని తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి వారిలో చైతన్యం తీసుకువచ్చారు.
అన్ని వేళలా అండదండలు అందిస్తూ, మన నాయకుని అడుగులో అడుగులు వేస్తూ, కష్ట సుఖాలలో పాలు పంచుకుంటూ, అనునిత్యం వెంట ఉంటున్న నాయకులు, కార్యకర్తలు, అభిమానుల రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి డిసిసిబి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఎలక్షన్ మెజారిటీ…
చిన్న కొండూరు
టీఆరెఎస్ : 1,007
బీజేపీ. : 543
కాంగ్రెస్. : 332
టీఆరెఎస్ మెజారిటీ: 464
మందల గూడెం
టీఆరెఎస్ : 608
బీజేపీ. : 430
కాంగ్రెస్. : 82
టీఆరెఎస్ మెజారిటీ: 178
చిన్న కొండూరు మెజారిటీ:464
మందల గూడెం మెజారిటీ :178
మొత్తం టీఆరెఎస్ మెజారిటీ: 642