టిఆర్ఎస్ నేతల సంబరాలు
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ నేతల సంబరాలు మొదలయ్యాయి. మునుగోడు ఉప ఎన్నిక ఫలితంలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపు ఖాయమవడంతో.. పార్టీ నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుని ఎంజాయ్ చేస్తున్నారు. జై తెలంగాణ నినాదాలు, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై భారత్ నినాదాలతో తెలంగాణ భవన్ దద్దరిల్లిపోతోంది. గులాబీ జెండాలు రెపరెపలాడుతున్నాయి.