జుక్కల్ నియోజకవర్గంలో కొనసాగుతున్న జోడో యాత్ర
.. నేటితో తెలంగాణాలో యాత్ర ముగింపు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత్ జోడో యాత్ర పన్నెండవ రోజు జుక్కల్ నియోజకవర్గం లో కొనసాగుతుంది ఉదయం జుక్కల్ చౌరస్తా నుంచి మొదలైన భారత్ జోడో యాత్ర నేటితో ముగియనుంది. గత 12 రోజులుగా తెలంగాణలో భారత్ జోడో యాత్రకు విశేష స్పందన లభిస్తుండగా ఈరోజు ఉదయం జగన్నాథ్ పల్లె మీదుగా షెహాపూర్ వరకు యాత్ర కొనసాగనుంది. షెఖపూర్ వద్ద భోజన విరామం తీసుకోనున్న రాహుల్ అనంతరం సాయంత్రం 4గంటలకు కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మేనూర్ లో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. సభ అనంతరం మహారాష్ట్ర సరిహద్దుకు చేరుకుంటుంది. రాత్రి 9.30కి మహారాష్ట్ర పీసీసీ కి జాతీయ జెండాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ అందించనున్నారు.