డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో మునుగోడు విజయోత్సవ బైక్ ర్యాలీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు నియోజకవర్గంలో తెరాస అభ్యర్థి కోసుకుంట్ల ప్రభాకర్ రిడ్డి విజయం సాధించిన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఎన్నికల ఇంఛార్జి గా వ్యవహరించిన చిన్న కొండూరు మందల గూడెంలలో తెరాస అభ్యర్థి కి 642 ఓట్ల మెజారిటీ రావడం పోచారం భాస్కర్ రెడ్డి పనితీరుకు నిదర్శనమని నసురుల్లాబాద్ మండల తెరాస పార్టీ నాయకులూ పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెరాస విజయాన్ని  అందరు కలిసి ఘనంగా సోమవారం జరుపుకున్నారు. ఈ సందర్బంగా యువ నాయకులు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కి సాదరంగా స్వగతం పలికేందుకు నసురుల్లాబాద్ మండల నాయకులు నసురుల్లాబాద్ మండల కేంద్రం నుండి బాన్సువాడ మండలంలోని జక్కలదాని తాండ వరకు తెరాస శ్రేణులు భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. అదేవిదంగా  జె.కె తాండ నుండి బాన్సువాడ పట్టణ కేంద్రంలోని భాస్కర్ రెడ్డి  ఇంటి వరకూ అందరూ సమన్వయంతో బైక్ఘ ర్యాలీ కొనసాగించారు. ఈ కార్యక్రమంలో తెరాస గ్రామ అధ్యక్షులు గుండావార్ బాలకృష్ణ, యువజన విభాగం అధ్యక్షులు బొడిగె భాను ప్రకాష్ గౌడ్, తెరాస సీనియర్ నాయకులు వంగ లక్ష్మీనారాయణ గౌడ్, రవి సెట్, మైశగౌడ్, కటికే బాలాజీ, చంద్రశేఖర్ గౌడ్, తెరాస నాయకులు, యువకులు భారీ సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.