తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తమ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. దీనికి కారణం సంస్కరణలను జనం అర్థం చేసుకోలేకపోవడమేనని చెప్పారు. సంస్కరణలు చేసేవారికి వ్యతిరేకత ఎక్కువ ఉంటుందని మంత్రి పేర్కొన్నారు. సంస్కరణలకు ముందే ఫలితాలురావు.. అందుకే ప్రజల ఆమోదం రాదన్నారు. సంస్కరణలతో ప్రజల్లో తొలుత వ్యతిరేకత వస్తుందని తెలిసినా… సీఎం జగన్ సంస్కరణల బాట పట్టారని పేర్కొన్నారు.