కేటీఆర్ ను కలిసిన ఆర్టీసీ చైర్మెన్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడులో టిఆర్ఎస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా పురపాలక మరియు ఐటి శాఖ మంత్రివర్యులు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు  కల్వకుంట్ల తారక రామారావుని టిఎస్ ఆర్టిసి చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందజేశారు.

టిఎస్ ఆర్టిసి సంస్థకు ఆర్థిక సహాయ, సహకారాలు అందిస్తూ వెన్నంటి ప్రోత్సహిస్తున్న గౌరవ పురపాలక మరియు ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..

టిఎస్ ఆర్టిసి సంస్థ ఉద్యోగులందరూ తెరాస ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు మరియు మెరుగైన సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు సంస్థ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంలో మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ విజయం సాధించిన సందర్భంగా గౌరవ పురపాలక మరియు ఐటీ శాఖ మంత్రివర్యులు, తెరాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావుని మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేను అందజేసిన  తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్, నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పథకాలే, మునుగోడు ఉప ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థిని గెలిపించారని చెప్పారు..

టిఎస్ ఆర్టిసి సంస్థకు గౌరవ తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు 100 కోట్లు మంజూరు చేసి, సంస్థ అభివృద్ధికి సహాయ సహకారాలు అందించడం ఎంతో సంతోషకరం..

ప్రభుత్వ సహాయ సహకారాలతో తెలంగాణ ఆర్టీసీ సంస్థ అభ్యున్నతి దిశగా పయనిస్తుందని చెప్పారు..
కానీ ఇతర రాష్ట్రాలలో ఆర్టీసీ సంస్థ దుర్బర స్థితిలో ఉందని అన్నారు.

గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారి ఆశీస్సులతో టిఎస్ ఆర్టిసి సంస్థ ఉద్యోగుల పెండింగ్ లో ఉన్న 5 డిఏలు, దీపావళి సందర్భంగా పండగ అడ్వాన్సులు ఇవ్వడం వల్ల ఉద్యోగులందరూ ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పారు.

టిఎస్ ఆర్టిసి సంస్థకు ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తూ వెన్నంటి ప్రోత్సహిస్తున్న గౌరవ పురపాలక మరియు ఐటి శాఖ మంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు..

టిఎస్ ఆర్టిసి సంస్థ ఉద్యోగులందరూ తెరాస ప్రభుత్వం అందిస్తున్న ప్రభుత్వ పథకాలు మరియు మెరుగైన సౌకర్యాలకు రాష్ట్ర ప్రభుత్వానికి అండగా ఉంటూ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారి నాయకత్వాన్ని బలపరిచినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు చెప్పారు.

అతి త్వరలోనే గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు స్ పిఆర్సిని అమలు చేయడం జరుగుతుందని సంస్థ చైర్మన్ శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ తెలియజేశారు..

Leave A Reply

Your email address will not be published.