దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితా విడుదల

 తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాను  కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) విడుదల చేసింది.బీహార్‌లోని కతిహార్ దేశంలోని అత్యంత కాలుష్య నగరాల జాబితాలో అగ్రస్థానం సంపాదించుకుంది. ఈ జాబితాలో ఏపీలోని విశాఖపట్టణంతోపాటు తెలంగాణ రాజధాని హైదరాబాద్‌ కూడా ఉన్నాయి. ఈ మేరకు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ) నిన్న కాలుష్య నగరాల జాబితాను విడుదల చేసింది.జాబితాలో అగ్రస్థానంలో ఉన్న కతిహార్‌లో గాలి నాణ్యత (ఏక్యూఐ) 360 పాయింట్లకు పడిపోగాఢిల్లీలో 354, నోయిడాలో 328, ఘజియాబాద్‌లో 304 పాయింట్లతో వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. బీహార్‌లోని బెగుసరాయ్హర్యానాలోని బల్లాబ్‌గఢ్ఫరీదాబాద్కైతాల్గురుగ్రామ్మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ కూడా కాలుష్య కారక నగరాల జాబితాలో చేరాయి. తెలుగు రాష్ట్రాల్లో విశాఖపట్టణంహైదరాదాబాద్‌ కూడా కాలుష్య నగరాల జాబితాలో చోటు దక్కంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విశాఖపట్టణంలో గాలిలో నాణ్యత 202 పాయింట్లుగా ఉండగాహైదరాబాద్‌లో 100 పాయింట్లుగా ఉంది. ఇకఅనంతపురం (145), తిరుపతి (95), ఏలూరు (61) కూడా ఈ జాబితాలో చేరాయి.

Leave A Reply

Your email address will not be published.