మునుగోడు ఫలితంపై కేసీఆర్ అసంతృప్తి?

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో విజయంపై తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు కార్యకర్తలు సంబరాల్లో ఉండగా.. పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మాత్రం ఈ ఫలితంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. సోమవారం సాయంత్రం నల్గొండకు చెందిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి. జగదీశ్రెడ్డి గెలుపొందిన అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి నేతృత్వంలోని టీఆర్ఎస్ నాయకులు ప్రగతి భవన్లో తనను కలవడానికి వచ్చినప్పుడు కేసీఆర్   మెజారిటీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం.మునుగోడులో టీఆర్ఎస్కు కనీసం 35 వేల ఓట్ల మెజారిటీ వస్తుందని కేసీఆర్ అంచనా వేశాడు. కానీ గెలుపు మెజార్టీ కేవలం 10000 ఏమాత్రం సంతృప్తికరంగా లేదు. బీజేపీ వైపు ఇంకో 5000-6000 ఓట్లు వచ్చినా మన పరువు పోయేదేమో” అని కేసీఆర్ మునుగోడునేతలతో అసంతృప్తి వ్యక్తం చేసిన సమాచారం. అయితే కమ్యూనిస్టు పార్టీల మద్దతు వల్లే ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచిందని కేసీఆర్ అన్నట్టు సమాచారం.. నా చొరవ వల్లనే సీపీఐ సీపీఐ-ఎంలు మనకు మద్దతు ఇచ్చాయి. ఈ పార్టీలకు భారీగా డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చింది‘ అని ఆయన వివరించారు. దాదాపు 39 శాతం ఓట్లు లేదా 87000 ఓట్లు బీజేపీకి రావడాన్ని కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నట్టు తెలిసింది. రాజగోపాల్ రెడ్డి ప్రభావంతో బీజేపీకి ఎక్కువ ఓట్లు పడినప్పటికీ నల్గొండలో బీజేపీ పెద్ద పవర్గా ఎదిగిందన్న అభిప్రాయం దీనివల్ల కలుగుతోందని ఆయన అన్నారు.టీఆర్ఎస్ ఈ విజయంపై ఎంత వివరణ ఇచ్చినప్పటికీ.. బీజేపీ బలమైన శక్తిగా ఎదిగిందని ఇది వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్కు మంచిది కాదని ముఖ్యమంత్రి వారికి హితవు పలికినట్టు సమాచారం.  కమ్యూనిస్టు నాయకుల మద్దతు లేకుంటే ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించేది కాదని.. వారికి కృతజ్ఞత సభ ఏర్పాటు చేయాలని జగదీశ్ రెడ్డిని కోరినట్లు సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లోనూ వారి మద్దతు అవసరం అని తెలుస్తోంది.మంగళవారం హైదరాబాద్లోని హిమాయత్నగర్లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మక్దూం భవన్ను ఇతర టీఆర్ఎస్ నాయకులతో కలిసి జగదీశ్రెడ్డి సందర్శించి మునుగోడులో బీజేపీపై టీఆర్ఎస్ పోరుబాట పట్టడంతో తమకు మద్దతుగా నిలిచిన సీపీఐ సీపీఐ(ఎం)లకు కృతజ్ఞతలు తెలిపారు. సీటును నిర్ణయాత్మకంగా గెలుచుకోవడంలో సహాయపడినందుకు థాంక్స్ చెప్పారు.ప్రధానమంత్రి నరేంద్రమోడీని బీజేపీని ఢీకొట్టేందుకు జాతీయ రాజకీయాల్లోకి దూసుకెళ్తున్న తరుణంలో  టీఆర్ఎస్ మిత్రుల కోసం చూస్తుండగా కమ్యూనిస్టులు – గులాబీ పార్టీల మధ్య కొత్త స్నేహం కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. వామపక్ష నేతలతో సమావేశం అనంతరం జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడులో మాదిరిగానే జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.సీపీఐ సీపీఐ(ఎం)ల సహకారంతో మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి విజయం సాధించారని ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ బీజేపీ బలపడే ప్రమాదం నుంచి తమ పార్టీ రాష్ట్రాన్ని కాపాడినందుకు సంతోషంగా ఉందన్నారు.త్తంగా మునుగోడు గెలుపు చూస్తే ఇది కమ్యూనిస్టుల మద్దతుతోనే టీఆర్ఎస్ గెలిచిందని.. ఒంటరిగా పోటీచేస్తే బీజేపీకే అవకాశాలు ఉండేవని తెలుస్తోంది.

Leave A Reply

Your email address will not be published.