గంపగోవర్థన్ ను పరమర్శించిన మండల నాయకులు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/రామారెడ్డి ప్రతినిధి: రామారెడ్డి మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన నాయకులు ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ ను పరామర్శించారు. బస్వాపూర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ మాతృమూర్తి స్వర్గస్తులైన సందర్భంగా వారిని పమర్శించి వారి తల్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రామారెడ్డి మండల గొల్లపల్లి నాయకులు తదితరులు పాల్గొన్నారు.