హరిహారసుతుని వద్దకు అయ్యప్ప భక్తుల పాదయాత్ర

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  అయ్యప్పమాలను ధరించిన భక్తులు ఇరుముడులతో శబరిమలకు చేపట్టిన పాదయాత్ర కొనసాగుతోంది. నందిగామ అయ్యప్పస్వామి దేవాలయంలో మాహేశ్వరం మహా పాదయాత్ర బృందం ఆధ్వర్యంలో చేపట్టిన పాదయాత్ర గురువారంతో 23వ రోజుకు చేరుకుందని గురుస్వామిలు కిషోర్ గౌడ్,సత్యనారాయణ రెడ్డి, తెలిపారు.తమిళనాడు ఎస్ జిఆర్ కళ్యాణమండపంలో నిర్వహించిన మహాపడి పూజలో షాద్ నగర్ కు చెందిన అయ్యప్ప భక్తులు పాల్గొన్నట్లు వివరించారు. నియమనిష్టలతో చేపట్టిన పాదయాత్ర శబరిమలకు 38 రోజుల్లో చేరుకుంటుందని, స్వామివారి దర్శనం అనంతరం స్వరాష్ట్రానికి చేరుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భక్తులు గంగదార్ పల్లి వెంకటేష్,సత్యనారాయణ, అరుణ్ కుమార్, సురేష్, నందు, రాజు,లింగం, శ్రీను,మల్లేష్,పవన్, నవీన్,లింగం,శివ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.