ప్రభుత్వ సంస్థలపై విద్యార్థులకు అవగాహన
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: ఈరోజు బోర్లమ్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ప్రభుత్వ సంస్థలు అనే పాఠ్యoశం లో భాగంగా ఉపాద్యాయుడు అయ్యల సంతోష్ ఆధ్వర్యంలో గ్రామక్షేత్ర పర్యటన ద్వారా విద్యార్థులకు గ్రామ స్థాయిలో ఉండే ప్రభుత్వ సంస్థలు గ్రామ పంచాయతీ,సహకార సంఘం,ప్రాథమిక ఆరోగ్య కేంద్రo, అంగన్వాడీ కేంద్రం,పోస్ట్ ఆఫీస్,రేషన్ షాప్ తదితర సంస్థలను ప్రత్యక్షంగా చూపించి వాటిపైన అవగాహన కల్పిచారు. విద్యార్థులు ప్రత్యక్ష బోధన ద్వారా పాఠ్యాంశాన్ని సులువుగా అర్థం చేసుకుంటారని ఈ విధంగా కార్యాలయాల పర్యటనలు చేపట్టినట్టు ఉపాధ్యాయుడు అయ్యల సంతోష్ తెలిపారు. ఈ పర్యటనలతో విద్యార్థులు ఎంతో ఆనంద వ్యక్తం చేశారు పాఠ్యాంశాలు సులువుగా అర్థమయ్యాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ నర్సింలు, రెడ్ క్రాస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి ,దేవేందర్ రెడ్డి తదితరులున్నారు