ప్రభాకర్ రెడ్డి చే ప్రమాణ స్వీకారం చేయించిన శాసనసభాపతి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: మునుగోడు శాసనసభ నియోజకవర్గం నుండి ఉప ఎన్నికల్లో విజయం సాధించిన కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి చేత శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి చేత శాసనసభలో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ భవనంలోని సభాపతి చాంబర్లో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యకమంలో రాష్ట్ర మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కేటీఆర్, శ హరీష్ రావు, మహమూద్ అలీ, జీ జగదీష్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి,, పువ్వాడ అజయ్ కుమార్, MP లు, MLAలు, MLCలు, కార్పోరేషన్ చైర్మన్లతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి సైతం పాల్గొన్నారు. అనంతరం కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని శాలువాతో సన్మానించి, పుష్ప గుచ్ఛంతో శుభాకాంక్షలు తెలియజేశారు.