R-5 జోన్ నోటిఫికేషన్‌పై ఏపీ హైకోర్టును ఆశ్రయించిన రైతులు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: R-5 జోన్ నోటిఫికేషన్‌పై రైతులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. R-5 జోన్ ఏర్పాటుపై రేపు మ.12 గంటల లోపు గ్రామ సభలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. R-5 జోన్ ఏర్పాటుకు సంబంధించి సీఆర్డీఏ ప్రతిపాదనను ప్రత్యేక అధికారి ఆమోదించారని న్యాయవాదులు పేర్కొన్నారు. అలాగే రైతులకు వ్యక్తిగతంగా నోటీసులు ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ సభ నిర్వహించకుండా అభిప్రాయాలు తీసుకోవడం చట్ట విరుద్ధమని పిటిషనర్ తరపు లాయర్ వాదించారు. దీంతో గ్రామ సభలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది.

Leave A Reply

Your email address will not be published.