మావోయిస్టుల ఘాతుకం ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ వ్యక్తి హత్య
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ములుగు జిల్లాలోని వెంకటాపురంలో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. ఇన్ఫార్మర్ అనే నెపంతో ఓ వ్యక్తిని నరికిచంపారు. పోలీసులకు ఇన్ఫార్మర్గా వ్యవహరిస్తుండటంతోనే చంపామని పేర్కొంటూ అక్కడ ఓ లేఖ వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతుడిని వెంకటాపురం మండలంలోని కొండాపురం గ్రామానికి చెందిన గోపాల్ గా గుర్తించారు. మృతదేహం వద్ద లభించిన లేఖను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.