తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నల్గొండ జిల్లా హాలియా మండలం పాలెం గ్రామ శివారులో ఆసియాలోనే అతిపెద్ద రైస్ మిల్ వజ్రతేజ రైస్ ఇండస్ట్రీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమంలో తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్ రెడ్డికి మిల్ యాజమాన్యం శాలువా, పుష్పగుచ్చం తో ఘనంగా సత్కరించారు.