తెలంగాణ టిడిపి అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బాధ్యతలు స్వీకరించారు. గురువారంఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో కాసాని బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ నడిబొడ్డులో టీడీపీ పుట్టిందన్న విషయం మర్చిపోవద్దన్నారు. చంద్రబాబు అంటే క్షమశిక్షణ… క్రమశిక్షణ అంటే చంద్రబాబు’ అని అన్నారు. దివంగత సీనియర్ ఎన్టీఆర్ పిలుపుతో అన్ని జిల్లాల యువత టీడీపీ జెండా పట్టుకున్నారనితెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తెచ్చేందుకు గ్రామ గ్రామన తిరుగుతానన్నారు. ఎన్టీఆర్చంద్రబాబు చేసిన అభివృద్ధి పనులే మనకు ఎజెండా అనిచంద్రబాబు తనపై పెట్టుకున్న నమ్మకాన్నినిలబెట్టుకుంటానని కాసాని‌ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ స్పష్టం చేశారు.కాగా తెలంగాణ టీడీపీ కొత్త అధ్యక్షుడిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ నియమితులయ్యారు. ఇప్పటి వరకు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్న బక్కని నర్సింహులును పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నారు. ఆయన స్థానంలో కాసానిని కొత్త అధ్యక్షుడిగా నియమించారు. బక్కని నర్సింహులును జాతీయ కార్యదర్శిగా నియమించారు. కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఇటీవలే తెలుగుదేశం పార్టీలో చేరారు. తెలంగాణ ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడిగా ఉన్న ఆయన టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో హైదరాబాద్‌లో టీడీపీలో చేరారు. కాసాని 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. కాసాని గతంలో ఎమ్మెల్సీగారంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మెన్ గానూ పనిచేశారు.

Leave A Reply

Your email address will not be published.