తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సువర్ణభూమి శబరిమల ఆరోగ్య మహాపాదయాత్ర శుక్రవారం 5వ రోజుకు చేరుకుంది. ఉదయం కొమిరెడ్డి పల్లె గ్రామం నుండి పాదయాత్ర గురుస్వాములు గురువినయ్, వసంత్ ల ఆధ్వర్యంలో బయలుదేరిన మధ్యాహ్నం కన్నెమెట్ట అయ్యప్ప స్వామి ఆలయం చేరుకున్నారు. అనంతరం అయ్యప్ప స్వామి ఆలయంలో పడిపూజ, అభిషేకాలు, ;ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు బీ బి పాటిల్ సైతం పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు. అదేవిదంగా బుర్ర రాఘవేంద్రచారి స్వామి జన్మదినం సందర్బంగా వారు సైతం బిక్ష దాతగా సేవ చేసుకుంటున్నారు . పడిపూజ కార్యక్రమం కన్నుల పండువుగా కొనసాగింది. స్వాములే కాకుండా గ్రామస్తులు, భక్తులు, మాత స్వాములు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.