పేదల గోస… గోడు ఆలకించని దొర సర్కారు

.. గుంతలపై గులాబీ పూలు చల్లి కాంగ్రెస్ వినూత్న నిరసన

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గడీల పాలనలో గతుకుల రోడ్లె దర్శనమిస్తున్నాయి. పేదల గోస గోడును దొర సర్కారు ఆలకించడం లేదంటూ సమస్యపై కాంగ్రెస్ నేతలు వినూత్నoగా నిరసన తెలిపారు. రోడ్డు గుంతలపై గులాబీ పూలు చల్లి ఆందోళన కార్యక్రమo నిర్వహించారు. టిపిసిసి ఆదేశాల మేరకు జిల్లాలోని హన్మకొండ, వరంగల్ లోని అన్ని నియోజకవర్గాల్లో అధ్వాన్నంగా మారిన రోడ్లు కల్వర్టుల పరిస్థితులపై నిరసన తెలుపారు. హన్మకొండ & వరంగల్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్షులు నాయిని రాజేందర్ రెడ్డి పిలుపు మేరకు రోడ్లపై ఉన్న గుంతల హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. అనంతరం ర్యాలిగా హన్మకొండ లోని 8 వ డివిజన్ కుమార్ పల్లి మార్కెట్లో ఉన్నటువంటి రోడ్లపై ఉన్న గుంతలపై పూలు చల్లి నిరసన తెలియ చేసారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు తోట వెంకన్న, శ్రీమాన్ నాయకులు బంక సరళ, తోట వెంకటేశ్వర్లు, పోతుల శ్రీమాన్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ యాదవ్, AIPC జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పులి అనిల్ కుమార్, జిల్లా ఎస్.సి. డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, జిల్లా ఓబీసి డిపార్టుమెంటు చైర్మన్ బొమ్మతి విక్రం, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ అంకుష్, తౌటం రవీందర్, నల్ల సత్యనారాయణ, యువజన కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పల్లె రాహుల్ రెడ్డి, టిపిసిసి సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ముస్తాక్ నేహాల్, NSUI అద్యక్షుడు పల్లకొండ సతీష్, జిల్లా యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు బంక సంపత్ యాదవ్, అంబేద్కర్ రాజు, జిల్లా సోషల్ మీడియా కో-ఆర్డి నేటర్ కేతిడి దీపక్ రెడ్డి, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు బొంత సారంగం, ఎర్ర మహేందర్, గుంటి స్వప్న, డివిజన్ అద్యక్షులు ఎస్. కుమార్ యాదవ్, ఓరుగంటి పూర్ణ, తక్కలపల్లి మనోహర్, గాండ్ల స్రవంతి, బంక సతీష్ యాదవ్, బి. శ్రీధర్ యాదవ్, ఎ. శివాజీ, మహమ్మద్ జాఫర్, వల్లపు రమేష్, సింగారపు రవి ప్రసాద్, కొండా నాగరాజు, దోపతి రవి, కొండుక ప్రదీప్ కుమార్, తాళ్ళపల్లి సుధాకర్, పూరెల్ల రవి కిరణ్, పోగుల సంతోష్, జిల్లా, నగర కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్, NSUI నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.