వివాహితపై అత్యాచారానికి పాల్పడ్డ దొంగలు

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: జైపూర్: రాజస్థాన్ (Rajasthan)లో దారులు ఘటనవెలుగుచూసింది. ఓ ఇంట్లో చోరీకి వచ్చిన నలుగురు దుండగులు.. అంతటితో ఆగకుండా అక్కడున్న వివాహిత(45)పై ఆమె భర్త ఎదుటే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఇక్కడి సిరోహి(Sirohi) జిల్లాలో భార్యాభర్తలు నివసిస్తున్నారు. భర్త కాపలాదారుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలోనే.. వారిని దోచుకోవాలనే ఉద్దేశంలో నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు బుధవారం రాత్రి ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే దంపతులు నిద్రించేందు కుసిద్ధమవుతుండగా వారిని బంధించారు.

ఈ క్రమంలోనే మహిళ భర్తపై దాడి చేసి, అతని వద్ద నుంచి రూ.1,400 లాక్కున్నారు. మరింత నగదు, విలువైన వస్తువులు అప్పగించాలంటూ బెదిరింపులకు దిగారు. అయితే, కొన్ని వెండి ఆభరణాలు తప్ప ఏం దొరకలేదు. ఈ క్రమంలోనే నలుగురూ… భర్త ఎదుటి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.

ఈ ఘటనతో షాక్లో ఉండిపోయిన దంపతులు.. గురువారం ఇంట్లోనే ఉన్నారు. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని.. శనివారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నట్లు స్థానిక డీఎస్పీ జీతూ సింగ్ వెల్లడించారు.

ఈ ఘటనతో షాక్లో ఉండిపోయిన దంపతులు.. గురువారం ఇంట్లోనే ఉన్నారు. శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు ఈ మేరకు కేసు నమోదు చేసుకుని.. శనివారం ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నట్లు స్థానిక డీఎస్సీ జేత సింగ్ వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.