మాజీ ఎమ్మెల్యే మృతికి సంతాపం తెలిపిన రేవంత్ రెడ్డి
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మాజీ ఎమ్మెల్యే సీనియర్ రాజకీయ నాయకులు మందాడి సత్యనారాయణ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించడమే కాకుండా వారి కుటుంబ సభ్యులకు సానుభూతి సంతాపం తెలియజేశారు.
పొన్నాల సంతాపం…
మాజీ ఎమ్మెల్యే మందాడి సత్యనారాయణ రెడ్డి మృతి పట్ల టీపీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు..