కేసిఆర్ నేషనల్ పార్టీ పెడితే..టిఆర్ఎస్ కు మునుగోడు చివరి ఎన్నిక

తెలంగాణాలో మునుగోడు ఉప ఎన్నికల నగరా మోగింది. మునుగోడులో నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. అంటే ఇప్పటికి కచ్చితంగా ముప్పయి రోజుల గడువు అన్న మాట. ఈ నేపధ్యంలో అన్ని రాజకీయ పార్టీలు మునుగోడు మీద దృష్టి పెట్టాయి. ఇదిలా ఉంటే మునుగోడు ఉప ఎన్నిక ముందు తరువాత అన్నట్లుగా టీఆర్ఎస్ రాజకీయ పాత్ర ఉండబోతోందన్నది స్పష్టం అవుతుంది.మునుగోడు ఉప ఎన్నికల నాటికి తెలంగాణా రాష్ట్ర సమితి పేరుతోనే ఆ పార్టీ పోటీ చేయనుంది.

ఈ నెల 5న విజయదశమి రోజున కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా మారుస్తూ కొత్త పేరుతో కేంద్ర ఎన్నికల సంఘం వద్ద మార్పులు చేయనున్నారు.దాని కోసం ఒక ప్రక్రియ రాజ్యాంగబద్ధంగా ఉంటుంది. ఈ నెల 6న కొత్త పేరుతో టీయారెస్ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనున్నారు. తన వినతిని కూడా చేసుకోనున్నారు. అయితే  కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ ప్రతిపాదన వెళ్ళాక ఆ వెంటనే దానికి గ్రీన్ సిగ్నల్ రాదు. దానికకి కచ్చితంగా కొంత టైం పట్టే అవకాశం ఉంది. ఈ లోగానే మునుగోడు ఉప ఎన్నిక పూర్తి అవుతుందని పరిశీలకులు అంటున్నారు.ఇక మునుగోడు ఉప ఎన్నికలో పోటీచేసే అభ్యర్ధి టీయారెస్ పేరు మీదనే నామినేషన్ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంటుంది .అంటే ఈ ఎన్నికల వరకూ టిఆర్ఎస్ పేరు మారుమోగుతుంది అన్న మాట. ఈ ఉప ఎన్నికల తరువాత టిఆర్ఎస్ పేరు మారిపోతుంది. ఆ తరువాత వచ్చే ఏడాది తెలంగాణా అసెంబ్లీకి జరిగే సార్వత్రిక ఎన్నికలలో కొత్త పేరుతోనే టిఆర్ఎస్ పోటీ చేయాల్సి ఉంటుంది. అలాగే 2024 లోక్ సభ ఎన్నికలను ఆ పేరు తో జాతీయ స్థాయిలో ఎదుర్కోబోతున్నారని తెలుస్తోంది.మొత్తానికి ఇప్పటికి తేలేది ఏంటి అంటే టిఆర్ఎస్ పేరిట పోటీ చేసే చిట్ట చివరి ఎన్నికగా మునుగోడు ప్రాముఖ్యత సంతరించుకోబోతోంది అని అంటున్నారు. ఈ ఎన్నికలే టీయారెస్ రాజకీయ జాతకాన్ని కూడా మలుపు తిప్పే ఎన్నికలు అని అంతా భావిస్తున్నారు. ఏం జరుగుతుందో వేచి చూడాలి. 

Leave A Reply

Your email address will not be published.