సీఎం కేసీఆర్ తను కొనుక్కున్న విమానంతో రాష్ట్రం వదిలి పారిపోతాడు

.. బీఎస్సీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సీఎం కేసీఆర్ తను కొనుక్కున్న విమానంతో రాష్ట్రం వదిలి పారిపోతాడని బీఎస్సీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విమర్శించారు. నేడు ఆయన ఎబీఎన్ ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వానికి అమ్మాయిల అవసరాలపై కనీస బాధ్యత లేదన్నారు. విద్యార్థులపై నవీన్ మిట్టల్ చేసిన వ్యాఖ్యలని పూర్తిగా ఖండిస్తున్నానని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. విద్యార్థులపై కేసులు పెట్టిన ఏ ప్రభుత్వం కూడా నిలవలేదన్నారు. తనకూ ఓ కూతురుందని.. వాళ్ళకి బయటకి చెప్పుకోలేని సమస్యలు ఉంటాయన్నారు. కామన్ సెన్స్ ఉన్నోడు ముందు యూజీ విద్యార్థులకు హాస్టల్ ఇస్తాడన్నారు. నిజాం యూజీ గర్ల్స్‌కు హాస్టల్ ఇచ్చేంత వరకు బీఎస్పీ పోరాడుతుందని ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.