రైతులను కాపాడుకోవలసిన బాద్యత ప్రతి ఒక్క పౌరుని పై ఉంది
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశానికి రైతు వెన్నుముఖ అని, రైతు లేనిదే దేశం లేదని,దేశం లో రైతులను కాపాడుకోవలసిన బాద్యత ప్రతి ఒక్క పౌరుని పై ఉందని తెలంగాణా రైతు హక్కుల సాదన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు గుర్రం నర్సింహులు అన్నారు. నేడు దేశం లో 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం మీదనే ఆదార పడి ఉన్నారని, కాని గిట్టుబాటు దర లేక దేశానికి అన్నం పెట్టె రైతులు ఆత్మ హత్యలు చేసుకొనే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసారు. ఫర్టలైజర్స్ ధరలు పెరగటం, అతి వృష్టి అనా వృష్టి , అకాల వర్షాలు, అదిక వడ్డిలకు రుణాలు వంటి అనేక కారణాలతో నేడు రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నరన్నారు. అంతే కాకుండా పంట పండి మార్కెట్కు వెలితే దళారుల దోపిడిలు రైతులను బలితీసుకుంటున్నాయన్నారు.పరిశ్