తీన్మార్ మల్లన్న మండల కమిటీల ఏర్పాటు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తీన్మార్ మల్లన్న ఆశయాల మేరకు స్టేట్ కమిటీ అధ్యక్షులు దాసరి భూమయ్య పిలుపు మేరకు 7200 మూమెంట్ లో భాగంగా కామారెడ్డి నియోజకవర్గంలోని మండలాల అధ్యక్షులను ప్రధాన కార్యదర్శులను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు ఎస్. కె. ఖాసీం, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణలు తెలిపారు.ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షుడు ఖాసీం మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న ఆశయాల మేరకు స్టేట్ కమిటీ అధ్యక్షులు దాసరి భూమయ్య గారి పిలుపు మేరకు 7200 మూమెంట్ లో భాగంగా ఈ నెల 26 న భద్రాచలం నుండి మల్లన్న పాదయాత్ర ప్రారంభం అవుతుందన్నారు. ఉచిత విద్య, ఉచిత వైద్యం కొరకు ఈ కార్యక్రమన్ని నిర్వహించడం జరుగుతుందని ఈ పాదయాత్ర ను విజయవంతం చెయ్యాలని అయన కోరారు.