మూడు రోజులపాటు రాష్ట్రంలో భారి వర్షాలు
రాష్ట్రంలో మంగళవారం నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదారాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీ తీరంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉన్న ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి నైరుతి దిశగా వంపు తిరిగి ఉన్నదని వివరించింది. ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఏర్పడిన మరో ఆవర్తనం సముద్రమట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించి ఉన్నదని తెలిపింది. వీటి ప్రభావంతో బుధవారం నుంచి మూడు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని వాతావరణ కేంద్రం ప్రాథమిక హెచ్చరిక జారీ చేసింది.