కాంగ్రెస్ మద్దతుతో అనుకోకుండా అరవింద్ ఎంపీ అయ్యారు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ మద్దతుతో అనుకోకుండా అరవింద్ ఎంపీ అయ్యారు ఆయన మాట్లాడే భాషతో నిజామాబాద్ పరువు పోతోందని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. శుక్రవారం పాత్రికేయుల సమావేశంలో కవిత మాట్లాడారు. పార్లమెంట్ లో ఎంపీ లు అవరేజ్ గా 20 డిబేట్ లలో పాల్గొంటే అరవింద్ 5 చర్చల్లో పాల్గొన్నారు. పార్లమెంట్ లో ఏ ఒక్క అంశం పై గొంతెత్తి మాట్లాడలేదన్నారు. పసుపు బోర్డ్ తెస్తామని బాండ్ పేపర్ రాసి రైతులను మోసం చేశారు. రేపటి నుంచి పోలీస్ స్టేషన్ లలో రైతులు చీటింగ్ కేసులు పెట్టబోతున్నారని పేర్కొన్నారు. ఆయన క్వాలిఫికేషన్ పైన నేనే పార్లమెంట్ కు ఫిర్యాదు చేస్తానని, అరవింద్ బురద లాంటోడు ఆయన మీద రాయి వేస్తే మన మీదనే పడతది అన్నారు. నేను కాంగ్రెస్ తో టచ్ లో వున్న అని కాంగ్రెస్ సెక్రటరీ చెప్పాడంట అరవింద్ ఎందుకు కాంగ్రెస్ కు టచ్ లో వున్నారు నిజమా బాద్ ప్రజల ఖర్మ తో ఆయన గెలిచాడని తెలిపారు.