ములాయం సింగ్‌ ఆరోగ్యం విషమం

సమాజ్‌ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్‌ ఆరోగ్యంగా ఇంకా విషమంగానే ఉన్నది. అనారోగ్య కారణాలతో ఆయన గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రిలో చేరగా.. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. సోమవారం అఖిలేశ్‌ యాదవ్‌రామ్‌ గోపాల్‌ యాదవ్‌ ఆసుపత్రికి చేరుకొని ములాయం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. పలువురు కుటుంబ సభ్యులు సైతం ప్రస్తుతం ఆసుపత్రిలోనే ఉన్నారు.ములాయం సింగ్‌ను ప్రస్తుతం క్రిటికల్‌ కేర్‌ యూనిట్‌ (CCU)లో చికిత్స పొందుతున్నారనినిపుణుల బృందం చికిత్స అందిస్తుందని మేదాంత ఆసుపత్రి హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. ఇదిలా ఉండగా.. బనారస్‌ హిందూ యూనివర్సిటీకి చెందిన అశుతోష్‌ సింగ్‌ తన కిడ్నీని ములాయం సింగ్‌ యాదవ్‌కు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకు గురుగ్రామ్‌లోని మేదాంత ఆసుపత్రికి చేరుకున్నాడు.

Leave A Reply

Your email address will not be published.