ఇండియన్ రేసింగ్ లీగ్ ను పరిశీలించిన మంత్రులు
తెలంగాణజ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ నగరంలోని హుస్సేన్ సాగర్ తీరంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఇండియన్ రేసింగ్ లీగ్ను (Indian Racing League) Race – 3 ను VIP గ్యాలరీ నుండి రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, డా. V. శ్రీనివాస్ గౌడ్, మహమ్మద్ మహమూద్ అలీలు ఆదివారం వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రులను రేసింగ్ నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు దానం నాగేందర్, హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి , తెలంగాణ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం ప్రధాన కార్యదర్శి A. సత్యనారాయణ, కోశాధికారి పుల్లెంల రవీందర్ కుమార్ గౌడ్,తలసాని సాయి, ప్రముఖ డాక్టర్ వంశీ గౌడ్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు mb కృష్ణా యాదవ్, నగర శాఖ అధ్యక్షుడు గండూరీ వెంకట్, కార్యదర్శి తమటం లక్ష్మణ్ గౌడ్ లు పాల్గొన్నారు.