అనంత‌గిరి ఘాట్ రోడ్డులో అదుపు త‌ప్పి ఆర్టీసీ బ‌స్సు బోల్తా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అనంత‌గిరి ఘాట్ రోడ్డులో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న ఆర్టీసీ బ‌స్సు అదుపు త‌ప్పి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఓ మ‌హిళా ప్ర‌యాణికురాలు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. ప‌లువురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో బస్సులో 70 మంది ప్ర‌యాణికులు ఉన్న‌ట్లు తెలుస్తోంది. బ్రేకులు ఫెయిల్ కావ‌డంతోనే ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.

Leave A Reply

Your email address will not be published.